సేఫ్‌గా బ‌యట‌ప‌డిన విజ‌య‌సాయిరెడ్డి..

వైసీపీ కీల‌క నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న పిటిష‌న్‌ను రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా కేబినెట్ ర్యాంక్ స్థాయిలో విజ‌య‌సాయిరెడ్డి లాభ‌దాయ‌క ప‌ద‌విలో ఉన్నార‌న్న కార‌ణంతో ఆయ‌న‌పై ఫిర్యాదు వెళ్లింది.

బీజేపీ నేత సీ.హెచ్ రామ‌కోట‌య్య ఈ మేర‌కు రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న వ్య‌క్తి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఉండ‌టంపై ఈయ‌న ఫిర్యాదు చేశారు. లాభ‌దాయ‌క ప‌దవులు క‌లిగి ఉన్న నేప‌థ్యంలో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. అయితే దీనిపై రాష్ట్రప‌తి ఎన్నిక‌ల క‌మీష‌న్ అభిప్రాయం తీసుకున్నారు.

కాగా విజ‌య‌సాయిరెడ్డి ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోనందున ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమిషన్ తెలిపింది. ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ వర్తించదని ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ఈసీ అభిప్రాయం మేరకు అనర్హత పిటిషన్‌ను కొట్టేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here