మహేష్ బాబు నిర్మాతగా మరో సినిమా..

ఓవైపు హీరోలుగా రానిస్తూనే.. మరోవైపు నిర్మాతలుగా మారుతున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. ఈ జాబితాలో ఇప్పటికే చేరిపోయారు ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ కు ఇప్పటికే సొంత బ్యానర్ ఉంది. కొన్ని రోజుల నుంచి మహేష్ తన సినిమాలకు సహ నిర్మాతగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మేజర్’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు మహేష్. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా అయిపోయింది. ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుదలకు ముందే మహేష్ నిర్మాతగా మరో సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

‘ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న నవీన్ పోలిశెట్టి మహేష్ బ్యానర్లో నటించనున్నాడని టాక్. నవీన్ తాను  రాసుకున్న కథలో హీరోగా నటిస్తూ, దర్శకత్వ బాధ్యతల్ని మరో వ్యక్తికి అప్పగించబోతున్నాడు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు త్వరలోనే ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక మహేష్ సినిమా నిర్మాణ వ్యవహారాలను భార్య నమ్రత చూసుకుంటోంది. మరి హీరోగా సూపర్ స్టార్ హోదా ను అందుకున్న మహేష్ నిర్మాతగా ఎంతవరకు రానిస్తాడో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here