వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంలోకి ‘రౌడీ’..!

అర్జున్‌రెడ్డి సినిమాతో యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు సెన్సేషన్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఓవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా మారిన విజయ్‌.. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విజయ్‌ తన బ్యానర్‌లో వెబ్‌ సిరీస్‌ను నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో ఒక ప్రాజెక్టును కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘దొరసాని’చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రాజెక్ట్‌ ను సందీప్ వంగతో కలిసి విజయ్ ప్రొడ్యూస్ చేస్తాడట. మరి వెబ్‌ సిరీస్‌ రంగంలో విజయ్‌ ఎంత వరకు రాణిస్తాడో చూడాలి. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో అనన్య పాండ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్‌ శెట్టి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here