మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జెఫ్రీ గీ చిన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. బహుశా ఒక తెలుగు సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండడం ఇదే తొలిసారి కావచ్చు. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే… ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మంచు విష్ణు సినీ కెరీర్ కి మోసగాళ్లు సినిమా ఎలాంటి మైలేజ్ ఇస్తుందో చూడాలి.
Launching the title motion poster of MOSAGALLU! Wishing the best for #Mosagallu @ivishnumanchu @MsKajalAggarwal @sunielvshetty @theleapman pic.twitter.com/xLfPrZcnmB
— Venkatesh Daggubati (@VenkyMama) September 18, 2020