ముచ్చటగా మూడో సినిమాకు సై అన్న వెంకీ..

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 34 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్‌3 సినిమాలకు ఓకే చెప్పిన ఈ హీరో తాజాగా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వెంకీ ఓ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం.

ఇక ఈ సినిమాలో వెంకీ లెక్చరర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. గతంలో వెంకటేష్‌ హీరోగా వచ్చిన సుందరాకాండలో మాస్టారుగా ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు మళ్లీ అదే పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమా కథ మాత్రం గుర్రపు పందేల నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్‌ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను సురేశ్‌బాబు నిర్మించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here