ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి అంతా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ చిత్రంపై ఉంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తుండడం, ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై సగటు సినీ ప్రేక్షకుడితో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇటీవల హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టీజర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ను అందించనున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు కథను వెంకటేష్ నేరేట్ చేయనున్నారని సమాచారం. అంటే.. అచ్చంగా జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లన్నమాట. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ విష్ణుకు సోదరిగా నటిస్తుండగా, హీరోయిన్గా బాలీవుడ్ బామ రుహీ సింగ్ నటిస్తోది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్కు పరిచయవుతున్నారు. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనలకు తెర తీస్తుందో చూడాలి మరి.