మీడియా తరచూ పవన్ కళ్యాణ్ ని లేదా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరినీ విడివిడిగా కంటే కలిపే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది మీడియా. చిరంజీవి ఈవెంట్ లలో కానీ మెగా ఫామిలీ ఈవెంట్ లలో కానీ పవన్ మిస్ అయితే చాలు మీడియా కి ఆ రోజు చేతినిండా పని దొరికేసినట్టే అన్నమాట. పవన్ – చిరు విడిపోయారా అంటూ రాసే కథనాలు షాకింగ్ గా ఉంటాయి. చిరు – పవన్ ల మధ్యన ఎలాంటి అనుబంధం ఉండదు అనేది మీడియా వాదన కాగా వారిద్దరూ ఎలా ఉంటారో తమకే తెలుసు అంటున్నారు మెగా హీరోలు, ముఖ్యంగా మిస్టర్ సినిమా కోసం ఇంటర్వ్యూ లు ఇస్తున్న వరుణ్ తేజ్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.
వారిద్దరూ క్లోజ్ గానే ఉంటారు అనీ మీడియా హడావిడి కాస్త తగ్గించాలి అని అతను ఇంటర్వ్యూ లో ఓపెన్ గా చెప్పేసాడు. పవన్కి చిరంజీవితో కానీ, నాగబాబుతో కానీ ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని, అల్లు అరవింద్తో మాత్రమే పవన్కి కొన్ని మనస్పర్ధలు వున్నాయనేది ఒక వాదన.