వంశీ పైడిపల్లితో చేతులు కలపనున్న చెర్రీ..!

‘మహర్షి’ సినిమాతో ఒక్కసారిగా బడా దర్శకుల జాబితాలో చేరాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తోన్నా వంశీ తన తర్వాతి చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే వంశీ మహేష్ తో మరో సినిమా చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెర్రీకి వంశీ ఓ కథను వినిపించాడని దానికి రామ్ చరణ్ కూడా సానుకూలంగా స్పందించాడని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here