ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాయి. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ టాపిక్ అయ్యారు. ఓ మీటింగ్లో ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు చర్చ మొదలైంది.
వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం వైసీపీకి సపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ విలేకరి మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి భయపడుతున్నారా అని అడిగారు. దీంతో వెంటనే వంశీ మాట్లాడుతూ తాను రాజీనామాలకు భయపడబోనన్నారు. అప్పట్లో వై.ఎస్ జగన్ గాలికి ఎదురొడ్డి గెలిచిన వ్యక్తినని చెప్పారు.
దీంతో అక్కడున్న వారంతా ఖంగు తిన్నారు. వైసీపికి అనుకూలంగా ఉన్న వంశీ జగన్ తో పోటీలో తానే గెలిచానని చెప్పినట్లు మాట్లాడటం కరెక్టు కాదని డిస్కషన్ మొదలెట్టేశారు. జగన్ భారీ మెజార్టీ ముందు వంశీ ఏ స్థాయిలో పనికి వస్తారన్ని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా వంశీ అనుచరులు మాత్రం జగన్ను తక్కువ చేసి మాట్లడలేదని అయితే అప్పుడు గెలిచిన విధానం మాత్రమే చెప్పారని రిప్లై ఇస్తున్నారు.
మొత్తం మీద వల్లభనేని వంశీపై ఆయన వ్యతిరేకులు ఏ చిన్న అవకాశం దొరికినా ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి జగన్ ఈ విషయాలన్నింటిపై స్పందిస్తారో లైట్ తీసుకుంటారో వేచి చూడాలి.