‘మిస్టర్ సీ’ జిమ్ కి వెళ్తున్నాడు… మరి మీరు? 

లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్ల నుంచి మొదలుపెడితే.. జిమ్ సెంటర్ వరకు అన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. వ్యాయామం చేయడానికి ఇంట్లో తగిన ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది ఆరోగ్యాలపై ప్రభావం పడింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ లాక్ 4.0లో భాగంగా జిమ్ లకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్ని రోజులు వర్కౌట్లకు బ్రేక్ ఇచ్చిన చాలామంది.. తిరిగి జిమ్ ల బాట పడుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరిగి కసరత్తులు మొదలు పెట్టడానికి జిమ్ కు వెళ్లాడు. ఈ విషయాన్ని చెర్రీ భార్య… ఉపాసన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకుంది. రామ్ చరణ్ జిమ్ లో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ…’ మిస్టర్ సి మళ్లీ జిమ్ కు వెళ్తున్నాడు… మరి మీరూ.? ‘ అంటూ కామెంట్ చేసింది. ఉపాసన తన భర్త రామ్ చరణ్ ను ‘మిస్టర్ సీ’గా పిలుస్తుందనే విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here