ఒకవైపు అపోలో వారసురాలు, మరోవైపు మెగస్టార్ ఇంటి కోడలు.. ఇలా ఎంతో పాపులారిటీ ఉన్నా ఎప్పుడూ గ్రౌండ్ టు ఎర్త్ అన్నట్లు ఉంటారు ఉపాసన. రామ్ చరణ్ భార్యగా ఎక్కువ మందికి తెలిసిన ఉపాసన తన సేవా కార్యక్రమాలు, వ్యాపారం ద్వారా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇక చిన్ననాటి నుంచి వ్యాపారవేత్తల కుటుంబంలో ఉండడంతో ఉపాసనకు కూడా వ్యాపార లక్షణాలతో పాటు.. సామాజిక సేవ కూడా అలవాటైంది. ఇక ఉపాసన స్త్రీవాదంపై ఎప్పుడూ గలమెత్తి మాట్లాడుతుంటుంది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
తన మనసులో మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఉపాసన సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న దాడులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై మగవారికి ఏం చెప్తారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ’మహిళలను గౌరవించకపోతే దేవీకి పూజలు చేయకండి, పూజ గది నుంచి దేవీ ఫొటోను తీసేయండి’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ను విడుదల చేసింది సదరు మీడియా సంస్థ.. పూర్తి ఇంటర్వ్యూను శనివారం రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు.