తిరుమలలో కరోనా కల్లోలం.. శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఛాన్స్!

తిరుపతి, తిరుమలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరుపతిలో ఏకంగా కేసులు 2వేలకు చేరాయి. ఇటు తిరుమలలో శ్రీవారి ఆలయం పెద్ద జీయంగారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం కలకలంరేపుతోంది.. స్విమ్స్‌లో జియ్యంగారికి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా చిన్న జీయంగారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పెద్ద జీయంగారికి చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని తొలుత టీటీడీ అధికారులు భావించారు. ఈ నెల 5న పెద్ద జీయర్.. చాతుర్మాస దీక్ష తీసుకున్నారు. జీయర్ దీక్షలో ఉన్న సమయంలో పొలిమేరలు దాటకూడదని నిబంధన ఉంది. ఆరోగ్య రీత్యా ఈ ఉదయం పద్మావతి కోవిడ్ సెంటర్‌కు టీటీడీ అధికారులు తరలించారు. దీక్షలో ఉండడంతో తిరిగి మరికాసేపట్లో జీయర్‌ను పెద్ద జీయర్ మఠానికి వైద్యులు తరలించనున్నారు. మఠంలోనే జీయర్‌కు వైద్యం అందించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది

టీటీడీ శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపి వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తున్నారట. టీటీడీ దర్శనాల నిలిపివేతకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి.. ప్రభుత్వంతో చర్చించి దర్శనాల నిలిపివేతపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇవాళ టీటీడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేసి ఏకాంతంగా పూజలు నిర్వహించాలని టీటీడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే 18మంది అర్చకులు కూడా కరోనా బారిపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు. పెద్ద జీయంగార్‌ను కూడా చెన్నై అపోలోకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తరలిస్తున్నారు. మరికొంత మంది అర్చకులకు సైతం అస్వస్థతగా ఉండటంతో… మిగిలిన అర్చకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here