అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా హాస్పిటల్లో ఆయన కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఓ వైద్యుడు అంటున్నారు. దీంతో ఆయన్ను కలిసిన వారంతా క్వారంటైన్కి వెళ్లాలని చెబుతున్నారు.
కరోనా చికిత్స తీసుకుంటున్న ట్రంప్ నిన్న పలువురిని కలిసేందుకు బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందే ట్రంప్కు 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఏంటో చెప్పలేం అని వైద్యులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆయన కారులో బయటకు వచ్చారు. దీనిపై ఆ హాస్పిటల్ వైద్యుడు జేమ్స్ ఫిలిప్స్ మాట్లాడారు. కరోనా సోకిన ట్రంప్తో పాటు కారులో ఉన్న వారంతా క్వారంటైన్కి వెళ్లాలని ఆయన చెప్పారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అన్నారు. ఎందుకంటే ట్రంప్ ప్రయాణించిన కారు అలాంటిదన్నారు.
ట్రంప్ కారు బుల్లెట్ప్రూఫ్ మాత్రమే కాకుండా ఎలాంటి రసాయనిక దాడులు జరిగినా ఏమీ కాకుండా ఉంటుందట. కారులోకి గాలి కూడా చొరబడకుండా అత్యాధునికంగా ఈ కారు ఉంటుందట. దీంతో లోపల ఉన్న వారు కచ్చితంగా కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆ వైద్యుడు చెప్పారు. అయితే లోపలు ఉన్న ఇద్దరు సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు మాస్క్తో పాటు కళ్లద్దాలు కూడా పెట్టుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఎలాంటి రక్షక కవచాలు ధరించినా వారికి ప్రమాదమే అని ఆయన అన్నారు. మొత్తానికి కరోనా నుంచి చాలా నేర్చుకున్నా అని చెప్పే ట్రంప్ ఇప్పుడు కరోనా నిబంధనలు ఉల్లంఘించడంపై అందరూ విమర్శిస్తున్నారు.
ఈ విషయంలో ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఆయన్ను విమర్శిస్తున్న వారికి ఇదొక ఆయుధంలా ఉంటుందని అంటున్నారు. కాగా హాస్పిటల్ ఆవరణంలో ట్రంప్ మద్దతు దారులు ఆయన్ను కలిసేందుకు వచ్చారు. వీరిని కలుసుకునేందుకు ట్రంప్ బయటకు వచ్చారు.