భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతిచెందారు. ఈనెల 11వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ బుధవారం రాత్రి కన్నుమూశారు.
ఇటీవలె కర్నాటకలో బీజేపీ ఎంపీ అశోక్ గస్తి చనిపోగా.. తాజాగా కేంద్ర మంత్రి సురేష్ అంగడి చనిపోవడం విషాదంగా చెప్పొచ్చు. ఈయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. కర్నాటకలోని బెళగావి జిల్లాలోని కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బీజేపీ బెళగావి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఈయన 2004లో బెళగావి నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2009, 2014, 2019లో వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో మూడో సారి లోక్సభకు ఎన్నికైన ఆయన పలు పార్లమెంటు కమిటీల్లో సభ్యుడిగా కొనసాగారు. 2019లో కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. సురేష్ అంగడి మృతి చెందడం పార్టీకి తీరని లోటని చెప్పొచ్చు. బీజేపీ శ్రేణులంతా తీవ్ర సంతాపం తెలిపారు.