డిక్ల‌రేష‌న్‌పై క్లియ‌ర్ మెసేజ్ ఇచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి.. క‌రీందాసు, బీబీ నాంచారి ముస్లీం కాదా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో డిక్ల‌రేష‌న్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై తెలుగు అకాడ‌మీ చైర్మ‌న్ లక్ష్మీ పార్వ‌తి మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతుంటే ప్ర‌తిపక్షాలు మతం పేరుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నాయ‌న్నారు. డిక్లరేషన్ పేరుతో  అనవసరంగా ప్రభుత్వంపై, సీఎంపై బురద జల్లుతున్నాని చెప్పారు. చెన్నారెడ్డిని దింపేందుకు కాంగ్రెస్ నేత‌లు మత పరమైన అల్లర్లు సృష్టించే వారని. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి  కాంగ్రెస్ కల్చర్ ఇంకా చంద్రబాబుకి పోలేదన్నారు. చంద్ర‌బాబు నాయుడు హిందూ సాంప్ర‌దాయం ఎప్పుడు పాటించారో చెప్పాల‌న్నారు.

సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా అన్నారు, చంద్రబాబు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని.. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ వర్తిస్తుందాన్నారు. ఏపీలో మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. బీజేపీకి అసలు చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరంలో కూడా జగన్  పట్టు వస్త్రాలు సమర్పించారని. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్ర‌శ్నించారు. స్వామీజీల్లో కొంద‌రు కాషాయం ధ‌రించి రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ఆమె.. ముస్లీంగాఉన్న‌ బీబీ నాంచారి, క‌రీందాసు ఎవ‌రో స్వామీజీల‌కు తెలియ‌దా అని అడిగారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here