ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసేందుకు రూ.10 కోట్లు అప్పు తీసుకున్న సోనూసూద్‌..?

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్‌లో వేలాది మంది ప్ర‌జ‌ల‌ను సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ఆయ‌న ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఎంతో మందికి స‌హాయం అడిగిన వెంట‌నే స‌హాయం చేసి ఆదుకున్నారు.

కానీ సోనూసూద్ ఇదంతా అప్పు చేసి చేశాడా అన్న వార్త‌లు ఇప్పుడు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు సహాయం చేసేందుకు సోనూసూద్ త‌న ఆస్తులను తాక‌ట్టు పెట్టార‌న్న పుకార్లు ఇప్పుడు షికార్ చేస్తున్నాయి. ఆపదలోని వారికి సాయం చేయాలనుకోగానే తన చేతిలోని డబ్బులు అయిపోయినా ముంబై జూహూలోని తన ఆస్తులను తనఖా పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకుని.. ఆ డబ్బుతోనే అందరికీ సాయం అందిస్తూ వచ్చారు సోనూసూద్. ఒప్పందం సెప్టెంబర్ 15 న సంతకం చేయబడిందని. నవంబర్ 24 న నమోదు చేయబడిందని, రుణం పెంచడానికి 5 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు కూడా సమాచారం. అయితే ఈ వార్త‌ల‌పై మాత్రం ఇంత‌వ‌ర‌కు సోనూసూద్ స్పందించ‌లేదు. కోట్ల‌కు కోట్ల రూపాయ‌లున్న ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు స‌హాయం చేయ‌డానికి కూడా ముందుకు రాలేదు. కానీ సోనూసూద్ త‌న‌కున్న డ‌బ్బుతోనే అడిగిన వారికి కాద‌న‌కుండా స‌హాయం చేశాడు. అయితే ఆయ‌న నిజంగా ఆయ‌న ఆస్తులు తాక‌ట్టుపెట్టి ఇలా స‌హాయం చేశారా అన్న దానిపై ఆయ‌నే స‌మాధానం చెప్పాలి. ఏదేమైనా సోనూసూద్ అప్పు చేసి స‌హాయం చేశాడంటే నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజ‌న్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here