యాపిల్‌పై కోపాన్ని మొత్తం బ‌య‌ట‌పెట్టిన హీరో నాగార్జున‌.. ఎందుకంటే..

సీనీ న‌టుడు అక్కినేని నాగార్జున త‌న కోపాన్ని మొత్తం బ‌య‌ట‌పెట్టేశాడు. ఆయ‌న కోపం యాపిల్ సంస్థ‌పై చూపించాడు. అయితే నాగార్జున ఎందుకు యాపిల్‌ సంస్థ‌పై కోపంగా ఉన్నాడో చెప్ప‌లేదు. ఇంత‌కీ నాగార్జున ఏమ‌ని ట్వీట్ చేశారంటే..

యాపిల్ సేవ‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. వాళ్ల సేవ‌లు, పాల‌సీలు ఏక‌ప‌క్షంగా ఉన్నాయ‌న్నారు. భార‌త్‌లోని యాపిల్ స్టోర్ నుంచి యాపిల్ ప్రోడ‌క్ట్స్ కొనుగోలు చేసే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. వాళ్ల‌సేవ‌ల‌న్నీ ఏక‌ప‌క్షంగా ఉన్నాయ‌ని.. ఇదీ మరీ ఘోర‌మైన చ‌ర్య అన్నారు. కాగా నాగార్జున ఇలా ట్విట్ట‌ర్ వేదిక‌గా యాప‌ల్ సంస్థ విష‌యంలో ఎందుకు కామెంట్లు చేశార‌న్న దానిపై ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే యాపిల్ ఫోన్‌ను ఎంతో మంది ప్ర‌ముఖులు, అధికారులు వాడుతుంటారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున ఎందుకోసం ఇలా ట్వీట్ చేశార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here