ఏపీ ప్రభుత్వంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వై.ఎస్ జగన్ మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే డిస్కంలకు రూ 4,802 కోట్లు ఎగ్గొట్టారన్నారు. ఈ లెక్కన ఐదేళ్లలో డిస్కంలకు రూ 24 వేల కోట్ల నష్టాలు వస్తాయన్నారు.
రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న రైతుల విద్యుత్ పై మాట్లాడుతూ అన్నదాతలకు ఇచ్చేది విద్యుత్ రాయితీ కాదని చెప్పారు. కార్పోరేషన్ కంపెనీలకు ఇచ్చేది రైతు సబ్సీడీ ఎలా అవుతుందన్నారు. ఇక సొంత మీడియాకు సగం ప్రభుత్వ ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ప్రకటనలకు కోట్లు వెదజల్లుతున్నారని ఆరోపించారు.
సొంత మీడియా సంస్థలకు 66 శాతం ప్రకటనలు ఇచ్చుకున్నముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్నికాపాడతానని ప్రమాణం చేసిన జగన్.. ఆర్టికల్ 164(3) కింద చేసిన ప్రతిజ్ఞకు, ప్రమాణానికే మచ్చతెచ్చారని యనమల ఆరోపించారు.