ఏపీలో మద్యం అక్రమ రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఎలా తీసుకొచ్చినా పోలీసులకు పట్టుపడతామని గ్రహించిన అక్రమార్కులు ఏకంగా వాటర్ ట్యాంక్నే ఎంచుకున్నారు. అయినప్పటికీ పోలీసులకు చిక్కారు.
ఓ సినిమాలో సినీనటుడు ఆలీ బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో మద్యం అక్రమంగా రవాణా చేసేందుకు పలువురు ప్రయత్నించి దొరికిపోయారు. గుంటూరు జిల్లా అమరావతి వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా మధ్యం పట్టుబడింది.
వాటర్ ట్యాంకర్లో సుమారు 10వేల మద్యం సీసాలు తరలిస్తూ 8 మంది వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. వాటర్ ట్యాంక్లో మద్యం సీసాలు కనిపించడంతో అక్కడివారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే మద్యం స్వాదీనం చేసుకొని వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలె ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలు సైతం తగ్గించింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతున్నాయి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరి అక్రమ మద్యం సరఫరా చేసే వారు ఇప్పటికైనా ఆగుతారా లేక మరో కొత్త మార్గాలు ఎంచుకుంటారా అన్న దానికోసం వెయిట్ చేయాలి.