ఎప్పుడు తన సినిమా విశేషాలు, ఫోటోలను మాత్రామే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ‘బురదలో ఉండే పందితో ఎప్పటికీ కుస్తీ చేయకూడదు. దానివల్ల మీకే మురికి అంటుంది. దానికి మురికి అంటే చాలా ఇష్టం. జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన ఈ కొటేషన్ నేను చాలా రోజుల క్రితం నేర్చుకున్నాను’ అంటూ ట్వీట్ చేసింది సోనమ్.

అయితే సోనమ్ కపూర్ ఇప్పుడీ ట్వీట్ ఎందుకు చేసిందనే చర్చ అటు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, ఇట్లు ఆమె అభిమానుల్లోనూ మొదలైంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడతారని, నెపోటిజం ఉంటుందని… నటి కంగనా వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనాను ఉద్దేశించే సోనమ్ ఈ ట్వీట్ చేసిందని… చర్చ జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మొదలైన ఈ చర్చ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here