కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఆగిపోయింది. ఈ క్రమంలో సినిమాలు కూడా అన్నీ ఆగిపోయాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లు ప్రారంభం అవుతున్నాయి. స్టార్ హీరోలతో పాటు నటీనటులంతా సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటుడు అస్వస్థతకు గురైన విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కుప్పకూలిపోయాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ది కశ్మీర్ ఫైల్స్` సినిమాలో నటిస్తున్నారు. ముస్సోరిలో జరుగుతున్న షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఆయన అస్వస్థతకు గురైన విషయాన్ని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. షూటింగ్ సమయంలో కడుపునొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి మిథున్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఓ భారీ యాక్షన్ సీన్ తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏమీ కాలేదని.. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొన్నారని చెప్పారు.