దేశ మంతా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని హథ్రస్ యువతి హత్యాచారం ఘటనలో నిందితులు అమాయకులని కొత్త వాదన తెరపైకి వచ్చింది. నిందితులందరికీ మద్దతుగా ఓ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశం నిర్వహించింది బీజేపీ మాజీ ఎమ్మెల్యే కావడం విశేషం.
హథ్రస్ ఆందోళనలు ఇంకా చల్లారకముందే మరో వివాదం జరుగుతోంది. ఈ ఘటనలో నిందితులందరూ అమాయకులేనని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజ్ వీర్ సింగ్ నిందితులందరూ అమాయకులని ఆయన ఇంట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాలా మంది హాజరయ్యారు. బాదిత కుటుంబంపైన ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని సమావేశంలో చర్చించారు. కేసులో నిందితులు ఏ విచారణకైనా సిద్దంగా ఉన్నారని కానీ బాదిత కుటుంబ సబ్యులు మాత్రం తరచూ మాట మార్చుకుంటున్నారని వాదించారు. నిందితులను రక్షించేందుకు న్యాయ పరమైన మార్గాల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు విచారణ ఏ విధంగా సాగుతుందో అయోమయంలో ఉంది. దేశం మొత్తం నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తోంటో.. వీళ్లు మాత్రం నిందితులు అమాయకులు అనడం వెనుక ఏం జరుగుతుందో తెలియడం లేదు.