దారుణం.. అక్క కొడుకును కిరాత‌కంగా హ‌త్య చేసిన పిన్ని..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్క కొడుకును పిన్ని హ‌త్య చేసింది. అయితే ఘ‌ట‌న ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. అప్ప‌టివ‌ర‌కు బాగున్న అంద‌రూ అంత‌లోనే ఇలా పైశాచికానికి ఎలా ఒడిగ‌ట్టార‌రో తెలియ‌డం లేదు.

న‌ర‌సారావు పేట మండ‌లం చిన‌తుర‌క‌పాలేనికి చెందిన ఫాతిమా, ఆసియా అక్కాచెల్లెళ్లు. ఫాతిమాను పెద‌త‌ర‌క‌పాలేనికి చెందిన వ్య‌క్తితో, ఆసియాకు చిల‌క‌లూరిపేట‌కు చెందిన వ్య‌క్తితో వివాహం అయ్యింది. అయితే మూడు రోజుల క్రితం అక్క ఫాతిమా చెల్లెలు ఇంటికి త‌న పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లింది. ఆదివారం రోజు ప‌నిమీద ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. అయితే అంత‌లో ఏమైందో ఏమో ఆసియా త‌న అక్క కొడుకును కొట్టింది. చుట్టుప‌క్క‌ల వారు అడ్డుకోబోయినా విన‌లేదు. ఈ స‌మ‌యంలోనే క‌త్తితో ఏడేళ్ల ఫ‌యాజ్ క‌రిముల్లాను హ‌త్య‌చేసింది.

విష‌యాన్ని స్థానికులు వెంట‌నే పోలీసులు తెలిపారు. అక్క‌డ‌కు వ‌చ్చిన పోలీసుల‌పైనా ఈమె విచిత్రంగా ప్రవ‌ర్తించ‌డంతో ఆమెను తాళ్ల‌తో క‌ట్టేసి గుంటూరు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. ఆసియాకు మ‌తిస్థిమితం లేన‌ట్లు తెలుస్తోంది. బాలుడి మృత‌దేమాన్ని చిల‌క‌లూరిపేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ స‌భ్యులు, బంధువులు ఏం చేయ‌లేని స్థితిలో ఉండిపోయారు. వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here