మరోసారి డ్యూయల్ రోల్ లో మాస్ మహా రాజా..!

తనదైన మాస్ డైలాగ్‌లు, ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటారు మాస్ మహారాజా రవితేజ. రవి తెరపై కనిపించాడంటే చాలు సందడి సందడిగా ఉంటుంది. ఇక డ్యూయల్ రోల్ అయితే ఆ ఎనర్జీకి అడ్డే ఉండదు. రవితేజ ఇదివరకు డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. విక్రమార్కుడు నుంచి మొదలుపెడితే.. దరువు, డిస్కో రాజా వరకు ద్విపాత్రాభినయంతో అభిమానులు ఆకట్టుకున్నారు రవితేజ.

ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మరోసారి రెండు పాత్రల్లో నటించడానికి సిద్దమవుతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవి తేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈనెల 18న పూజా కార్యక్రమాల ద్వారా ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించినట్లు సమాచారం. రవితేజాకు జోడిగా ఇస్మార్ట్ భామ నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయెల్ నటించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసిన రవితేజ.. త్వరలోనే ‘క్రాక్’ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రమేష్ వర్మ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here