చాక్లెట్ కోసం కిరాత‌కంగా కొట్టి చంపేశారు..

చాక్లెట్ దొంగిలించాడ‌ని మంద‌లించాల్సింది పోయి.. కిరాత‌కంగా కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని మధుబని జిల్లాలో జ‌రిగింది. విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కొడుకును చంపేసిన‌ట్లు ఎవ్వ‌రి చెప్పొద్దంటూ కుటుంబ స‌భ్యుల‌ను కూడా బెదిరించార‌ట‌.

మ‌ధుబ‌ని పోలీస్ స్టేష‌న్‌ల ప‌రిధిలోని సోఠ్‌గావ్‌లో ఈ ఘ‌టన జ‌రిగింది. గ్రామానికి చెందిన అహ్మ‌ద్‌కి ప‌ద‌మూడేళ్లు. ఇత‌న స‌మీపంలోని కాసీమ్ అనే దుకాణాదారుడి వ‌ద్ద చాక్లెట్ దొంగిలించిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. దీంతో ఆ పిల్ల‌వాడు ఇంటి బ‌య‌ట ఆడుకుంటుండ‌గా కాసీమ్ వ‌చ్చి విచక్ష‌ణా ర‌హితంగా కొట్టాడు. స్థంబానికి క‌ట్టేసి చిత‌క‌బాదాడు. దీంతో అహ్మ‌ద్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఆ బాలుడి మృత‌దేహాన్ని వారి స‌మాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు పాతిపెట్టారు.

ఆ త‌ర్వాత మృతుని కుటుంబ స‌భ్యుల‌ను ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని హెచ్చ‌రించారు. అయితే ఇది ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స్థానికుల స‌మాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ కోసం ఇంత దారుణానికి పాల్ప‌డ‌తారా అంటూ విష‌యం తెలిసిన వారంతా మండిప‌డుతున్నారు. మ‌రి ఈ కేసులో ఇంకేమైనా విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయా అన్న‌ది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here