రాజకీయాలు వదిలేసి సినిమా రంగానికి చిరు రాబోతున్నాడు అనగానే చిరు ని ఎవరు చూస్తారేహే అంటూ మాట్లాడింది ఒక న్యూస్ ఛానల్. చివరకి చిరు రావడం ఖైదీ తీయడం ఆ సినిమా అద్భుత షేర్ కలక్ట్ చేసినా కూడా ఆ ఛానల్ సైలెంట్ గానే ఉండిపోయింది తప్ప చిరు స్టామినా గురించి పాజిటివ్ గా ఒక్క మాట కూడా లేద. ఇప్పుడు త్వరలో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ని జాతీయ స్థాయి లో తీసుకెళ్తున్నాడు అని ప్లాన్ చేస్తూ ఉంటె బాహుబలి ని చూసి ఓవర్ చేస్తున్నాడు అంటోంది ఆ ఛానల్ . కేవలం రికార్డుల పిచ్చితోనే చిరంజీవి ఈ పని చేస్తున్నాడని అభాండాలు వేస్తోంది.
బాహుబలి పేరిట రికార్డులు చూడడం ఇష్టం లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఆ రికార్డులు ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు అనేది ఆ ఛానల్ మాట. చిరు మీద ఆ ఛానల్ కి ఎందుకంత కక్ష , శాడిజం అనేది అర్ధం కాని వ్యవహారం. ఆ ఛానల్ ఓనర్ చిరూ తో బయట కలిసినప్పుడు సన్నిహితం గానే ఉంటారు మరి .