ఏపీ సీఎం చంద్రబాబు సర్కారును రద్దు చేయాలని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా హక్కుల్ని కాలరాసే చంద్రబాబు ఎట్టి పరిస్థితిల్లో పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి..ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ఆర్టికల్ 19(1)ఏ సెక్షన్ కింద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని సూచించారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ ను తప్పుపట్టిన ఆయన..కార్టున్లు భావ ప్రకటన హక్కులో ఓ భాగమని తెలిపారు. ప్రజలే పాలకులైన మనదేశంలో ఏపీ ప్రభుత్వతీరు దారుణమని ఆరోపించారు. ఆర్టికల్ 356 తో ప్రభుత్వాన్ని తొలగించాలని పేర్కొన్నారు.