అందుకు తమన్నా కూడా ఓకే చెప్పేసింది… 

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల  హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లు  తెరకెక్కుతున్నాయి. ఓటీటీ రంగంలోకి బడా నిర్మాణ సంస్థలు అడుగుపెట్టడంతో వెబ్ సిరీస్ ల విస్తృతి మరింత పెరిగింది. ఇక పారితోషకాలు కూడా ఎక్కువ ఇస్తుండడంతో బడా దర్శకులు, సినీ తారలు కూడా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ నటీనటులు డిజిటల్ స్క్రీన్ పై దర్శనం ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గరుడవేగ సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న దర్శకుడు.. ప్రవీణ్ సత్తార్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నాడు. అయితే ఇందులో తమన్నాను తీసుకోవాలని ప్రవీణ్ భావించినట్లు సమాచారం. దీనికి తమన్నా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ వెబ్ సిరీస్ ను 8 ఎపిసోడ్లుగా తీయనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here