కరోనా కారణంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ విదేశాల్లో జాలీజాలీగా గడిపే సెలబ్రిటీలు కూడా లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేరు. అయితే తాజాగా కేంద్రం ఇస్తోన్న సడలింపులతో మళ్లీ పర్యాటక రంగం పుంజుకుంటోంది. విమాన సేవలు క్రమేణా అందుబాటులోకి వస్తుండడంతో సినీ తారలు విదేశాల బాటపడుతున్నారు.
తాజాగా ఇదే క్రమంలో నటి తాప్సీ కూడా మాల్దీవుల్లో విహరిస్తోంది. అక్కడ అందమైన బీచుల్లో బికీనీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బ్లాక్ బికినీ ధరించి గాల్లో ఎగురుతూ గంట కొట్టడానికి ప్రయత్నిస్తుండగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. ఇందులో తాప్సీ హాట్ హాట్గా కనిపించింది. ఇక ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. తాప్సీ మాల్దీవ్ టూర్కు సంబంధించిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.