జమ్ము కశ్మీర్ పోలీసులు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ను అరెస్టు చేశారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే ఆయన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కాదు.. పోలీస్ ఆఫీసర్ నుంచి ఉగ్రవాదిలా మారిన వ్యక్తి. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అల్తాఫ్ హుసేన్ ఉగ్రవాదులతో కలిసి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈయన అక్టోబర్ 24న అదృశ్యమయ్యారు. ఇతను ఉగ్రవాదులతో కలిసి ఉన్నాడన్న సమాచారం రావడంతో పొలీసులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో ఓ వాహనంలోని వ్యక్తులు తమ వాహనంతో అకస్మాత్తుగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దానిని అత్యంత చాకచక్యంగా పోలీసులు ఆపగలిగారు. ఆ వాహనంలోని వ్యక్తులు పోలీసులపై దాడి చేసి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
వారిని భద్రతా దళాలు అదుపు చేయగలిగాయి. వీరిలో ఒకరు ఎస్పీఓ అల్తాఫ్ హుస్సేన్ అని గుర్తించారు. మిగిలిన ముగ్గురు – షబీర్ అహ్మద్ భట్, జంషీద్ మాగ్రే, జహీద్ దార్ – ఉగ్రవాదులని గుర్తించారు. వీరంతా పుల్వామాకు చెందినవారు. వీరిని అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు, ఇతర నేరపూరిత వస్తువులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఉగ్రవాదులుగా మారారన్న వార్త బయటకు రాగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.