కరోనాను జయించిన బాలు..  కానీ !

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబు ఆరోగ్యం ఒకానొక సమయంలో పూర్తిగా విషమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోసం ఎంతోమంది చేసిన ప్రార్థనలు ఫలించాయి.

తాజాగా బాలుకు కరోనా నెగిటివ్ అని నిర్దారణ అయ్యింది. అయితే ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బాలు కుమారుడు చరణ్ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘నాన్నకు కరోనా నెగిటివ్ వచ్చింది. కాకపోతే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నాన్న గారు స్పృహలోనే ఉన్నారు. తన ఐ ప్యాడ్ లో ఆయన టెన్నిస్, క్రికెట్ మ్యాచ్ లను చూస్తున్నారు’అని తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here