ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులపై అసహనం వ్యక్తం చేశారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు వెబ్సైట్లు వార్తలు కూడా ప్రచురించాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి సమాచారం మాత్రం బయటకు రాలేదు.
ఏపీ మంత్రివర్గ సమావేశంలో జరిగిన విషయాలు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రసారం అయ్యాయని అందుకే జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మామూలుగా అయితే మంత్రి వర్గ భేటి ముగిసిన తర్వాత మంత్రి ఒకరు మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఏం చర్చించారో, ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలియజేస్తారు.
అయితే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి గురించి తీవ్రంగా చర్చ జరిగితే మీడియాకు అఫిషియల్గా చెప్పకముందే టిడిపి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయంట. దీంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవ్వరూ చెప్పకపోతే విషయం బయటకు ఎలా వెళ్తుందని ఆయన ప్రశ్నించారట. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని స్ట్రాంగ్గా చెప్పారని తెలుస్తోంది.
మరి నిజంగా జగన్ తన మంత్రులపై మండిపడ్డారో లేక ఆయన వ్యతిరేక వర్గం ఏమైనా ఇలా కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందో తెలియదు.