కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు.

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కూడా కరోనా వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని మలైకా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో సోమవారం పంచుకుంది.

‘ఈ రోజు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. క్షేమంగా ఉన్నాను. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నాను. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండండి. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొంది. ఇక హీరోయిన్ కాజల్ తో పాటు మరికొందరు మలైకా త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టారు.

 

View this post on Instagram

🙏😷

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here