బాలు కోలుకుంటున్నారు..

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారినపడి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బాలు ఆరోగ్య పరిస్థితి చేయి దాటిపోతోందని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు ప్రార్థనలు చేశారు. తాజా సమాచారం ప్రకారం బాలు కోలుకుంటున్నారని తెలుస్తోంది.

బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తన తండ్రి ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించారు. ‘ తన తండ్రి  వేగంగా కోలుకుంటుండడంతో సంతోషంగా ఉంది. సోమవారం కల్లా శుభవార్త వినబోతున్నాం. ఆ రోజు ఆయనను ఐసీయూ  నుంచి సాధారణ గదికి మార్చే  అవకాశం ఉంది. ప్రస్తుతం నాన్న వెంటిలేటర్ సహాయం లేకుండానే సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సోమవారం కల్లా ఆయన కోలుకొని అందరితో మాట్లాడగలుగుతారని ‘ చెప్పుకొచ్చారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here