వెండితెరపై మరో సింగర్‌..

తెర వెనక ఉంటూ తమ గాత్రంతో అద్భుత పాటలకు ప్రాణం పోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సింగర్స్ అప్పుడప్పుడు తెరపై కూడా కనిపించి కనివిందు చేస్తుంటారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం నుంచి ఆర్పీ పట్నాయక్‌ వరకు ఈ వరుసలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో సింగర్ వచ్చి చేరనున్నారు. ఆయనే మనో.. ఇప్పటికే పలు రియాలిటీ షోల్లో జడ్జిగా పాల్గొంటూ బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైన మనో ఇప్పుడు వెండి తెరపై కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సీనియర్‌ డైరెక్టర్‌ శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మనో, శ్రీముఖి, రాజా రవీందర్, రఘు కుంచెలు నటించనున్నారు. ‘క్రేజీ అంకుల్స్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేయాస్‌ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లో విడుదల చేయనున్నారు. ప్రేక్షకులను తమ మంత్ర గానంతో మ్యాజిక్‌ చేస్తోన్న మనో వెండితెరపై ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here