మళ్లీ రిపీట్‌ కానున్న ‘ఓ బేబీ’ కాంబినేషన్‌.?

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కొరియన్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నందిని దర్శకత్వం సమంత నటన సినిమా విజయానికి ప్లస్‌ పాయింట్స్‌ గా నిలిచాయి.

ఇదిలా ఉంటే నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో మరో సినిమా రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సోనీ పిక్చర్స్‌ సమంతతో థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియాను సినిమాను ప్లాన్ చేసింది. ఈ సినిమాకు తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల శరవణ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here