ప్రభాస్ హీరోగా ‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తిని రేకెత్తిస్తోంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్గా వ్యవహరించనున్నట్లు వైజయంతి మూవీస్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సింగీతం శ్రీనివాసరావు స్కెచ్ పోస్టర్ని పోస్ట్ చేస్తూ.. ‘లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనను మా ఇతిహాసానికి స్వాగతిస్తునందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని కచ్చితంగా చెప్పగలం. క్వారంటైన్ సమయాన్ని కూడా మా సినిమా కోసం వినియోగించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా దీపిక పాడుకొనే నటిస్తున్నారు.