కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే….నన్నెవ్వ‌రూ క‌ల‌వ‌కండి..

ఏపీలో క‌రోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ శాతం పెరుగుతుంద‌న్న సంతోషం ఉంది. అయితే ఇప్పుడు సామాన్యుల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

క‌రోనా సోకి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తిరుప‌తి ఎంపి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రావు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు క‌రోనా సోకినా చివ‌ర‌కు నెగిటివ్ వ‌చ్చింది. అయితే గుండెపోటుతో ఆయ‌న మృతిచెందారు. కాగా ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులున క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్ మోహ‌న్ రావుకు క‌రోనా సోకింది. ఆయ‌న‌కు నీర‌సంగా ఉంటే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉంటే తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని చెబుతున్నారు.

కాగా ఇటీవ‌ల చాలా మంది ఎంపీ, ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. క‌రోనా సోకిన ఆయ‌న ఇప్పుడు ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌నున్నారు. వైద్యుల చికిత్స నిమిత్తం 14 రోజుల పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. కాగా ఈయ‌న ప్ర‌జ‌ల‌కు అభిమానుల‌కు ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. క‌రోనా సోకిన త‌న‌ను క‌లిసేందుకు ఎవ్వ‌రూ రావొద్ద‌ని చెప్పారు. ఫోన్ కూడా చెయ్య‌వ‌ద్ద‌ని కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here