‘జెంటిల్ మెన్’కు సీక్వెల్ రానుంది..

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్ మెన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 1993లో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో ఓ సంచలనం. అయితే ఈ సినిమా విడుదలైన 27 ఏళ్ల తరువాత ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు ఈ చిత్ర నిర్మాత కుంజుమోన్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. మరి అర్జున్ పోషించిన పాత్రను ఈ రీమేక్ లో ఎవరు పోషిస్తారు. మిగతా నటీనటులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే 1999లో విజయ్ హీరోగా నటించిన ‘ఎండ్రెండ్రం కాదల్’ అనే సినిమా తర్వాత కుంజుమోన్ మరో సినిమాను నిర్మించలేదు. ఇన్నేళ్ల తర్వాత తన నిర్మాణంలో భారీ విజయాన్ని సాధించిన ‘జెంటిల్ మేన్’ చిత్రానికి పార్ట్ 2 చిత్రాన్ని ప్రకటించడం విశేషం. జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ అనే బ్యానర్ లో ‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని తెలుగుతమిళ హిందీ మలయాళ కన్నడ భాషలలో నిర్మించనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here