బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇంటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ‘మన్నత్’ పేరుతో నిర్మించిన ఈ ఇంటి నిర్మాణంపై రకరకాల కథనాలు వస్తుంటాయి. సుమారు రూ.రెండు వందల కోట్ల విలువ చేసే అత్యంత విలాసవంతమైన ఇళ్లు ఇది. ముంబయిలో ఉన్న ఖరీదైన బంగ్లాల్లో ఇదీ ఒకటి. ఈ ఇంటిపై అడపాదడపా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక నెటిజన్లు కూడా అప్పుడప్పుడు షార్ఖ్ను ఈ ఇంటి గురించి అడుగుతూనే ఉంటారు. వాటికి షార్ఖ్ కూడా ఫన్నీ సమాధానాలిస్తుంటాడు. గతంలో ఓసారి ఓ అభిమాని ‘మన్నత్’కు ఎంత ఖర్చయింది అన్న ప్రశ్నకు షార్ఖ్ సమాధానమిస్తూ.. ‘25 ఏళ్ల నా కష్టం’ అని సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.
Bhai Mannat bikti nahi sar jhuka kar maangi jaati hai….yaad rakhoge toh life mein kuch paa sakogay. https://t.co/dh3gJTVnOu
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2020
అయితే తాజాగా అలాంటి ఓ ప్రశ్నకే సమాధానమిచ్చి నవ్వులు పూయించాడీ బాలీవుడ్ బాద్షా. షారుఖ్ తాజాగా ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ ఎస్ఆర్కే’ పేరిట ఫ్యాన్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘భాయ్ మన్నత్ను అమ్మేస్తున్నారా ఏంటి?’ అంటూ సందేహం వ్యక్తం చేయగా.. దానికి స్పందించిన షారుఖ్.. ‘మన్నత్ను ఎప్పుడూ ఎవరూ అమ్మలేరు.. ఇస్తారు.. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో అనుకున్నవని సాధిచంగలుగుతావు’అని చమత్కరించాడు. కాగా మన్నత్ అంటే హిందీలో వాగ్దానం (మాట ఇవ్వడం) అని అర్థం. ఈ విధంగా మన్నత్ను అమ్ముతావా అన్న అభిమాని ప్రశ్నకు సుతిమెత్తగా సమాధానమిచ్చాడు షారుఖ్.