నువ్వు నా వాడివి.!

టాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో నాగచైతన్య, సమంతల జంట ఒకటి. ‘ఏమాయ చేసావే’ సినిమాలో చైతన్యతో కలిసి నటించిన సమంత.. నిజంగానే చైతన్యను మాయ చేసింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వివాహం తర్వాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉంటే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటై నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. నాగచైతన్యతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నువ్వు పూర్తిగా నా వాడివి.. అలాగే నేను నీదానిని. మనం ఏ ద్వారం వద్దకు చేరుకున్నా.. ఇద్దం కలిసే దానిని తెరుస్తాం. నా ప్రియమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. ఇక ఈ బ్యూటీఫుల్‌ కపుల్‌కు ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాగచైతన్య, సమంత 2017 అక్టోబర్‌ 6న హిందూ సంప్రదాయ పద్ధతిలో.. అక్టోబర్‌ 7న క్రిస్టియన్‌ సంప్రదాయాన్ని అనుసరించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here