ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో అజ్ఞాత వాసిలా కాలం గడుపుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో చంద్రబాబుకు తెలియదన్నారు. ప్రజల సమస్యలపై ఎలా స్పందించాలోఆయన తెలియదన్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జల చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలిసిందంతా అధికారంలో ఉండటం మాత్రమే అని.. అధికారంలో లేని పక్షంలో ఎలా అధికారాన్నిసంపాదించాలని ఆయన చూస్తుంటారన్నారు. ఇక ఆయన డీజీపీకే ఎందుకు లేఖలు రాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తికి అధికారుల రూల్స్ తెలుసు కదా అన్నారు.
ఇక పోలీసులు పక్కగా పని చేస్తున్నారని.. ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని తెలిపారు.ఇక కోవిడ్ను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు ఇప్పుడు కోవిడ్ కోసం ఏదో చేస్తామని ముందుకొచ్చారన్నారు. ఇక టిడిపి నాయకుడి కారు అద్దాలు పగులగొట్టిన విషయమై మాట్లాడుతూ దీన్ని పోలీసులు తేలుస్తారన్నారు. ఇక ప్రజలు, మేధావులు ప్రజలకు మంచి జరిగే విషయాల గురించి ఆలోచించి సలహాలు ఇవ్వాలని.. ఇలాంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు.