వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ లకు అదిరిపోయే విజయాన్ని అందించింది ‘ఈ స్మార్ట్ శంకర్’ చిత్రం. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్, నభ నటేష్ తమ గ్లామర్తో యూత్ను అట్రాక్ట్ చేశారు. ఇలా టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కానుందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది.
తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఇస్మార్ట్ శంకర్ ను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ ను హీరోగా నటింపజేయడానికి చర్చలు కూడా మొదలయ్యాయని టాక్. మరి ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియాల్సి ఉంది.