ఇలాంటి ఆలోచన ధోరణి మారాలి.!

ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో యువతిపై జరిగిన అత్యాచార ఘటన యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఓ యువతిని కొంతమంది అత్యంత పాశవికంగా హింసించి, నాలిక కోసి, అత్యాచారానికి తెగబడ్డ ఘటన ప్రతి ఒక్కరినీ  కదిలించింది. ఇక బాధితురాలిని రాత్రికి రాత్రే పోలీసుల సమక్షంలో దహనం చేయడంతో విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతోంది.

యూపీ అత్యాచార సంఘటన గురించి సురేంద్ర సింగ్‌ మాట్లాడుతూ..’తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పాలని, అప్పుడే ఈ దేశంలో అత్యాచారాలు తగ్గుతాయి’ అని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలీవుడ్ లోని కొందరు హీరోయిన్లు ఎమ్మెల్యే మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై హీరోయిన్ కృతి సనన్ స్పందిస్తూ.. `అత్యాచారానికి గురవకుండా ఎలా ఉండాలో కూతుళ్లకు నేర్పాలా? అతనేం చెప్పాడో అతనికైనా అర్థమైందా? ఇలాంటి ఆలోచనా ధోరణులు మారాలి. కొడుకులకు ఎందుకు కాస్త సంస్కారం నేర్పరు` అని ప్రశ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here