ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకున్న ఆయన మధ్యాహ్నం కడప నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన తన ఇంటికి చేరుకున్నారు.
జగన్ వెంట విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వెంటకరమణ, బాలశౌరీలు ఉన్నారు. సీఎం జగన్ షెడ్యూల్ ప్రకారం రేపు ప్రధానితో సమావేశం ఉంది. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ రెండు కీలక సమావేశాలు ఆయన ముగించుకొని ఏపీ చేరుకుంటారు. ఈ సమావేశాల్లో ఆయన చర్చించే విషయాలపై ఏపీలో ఆసక్తి నెలకొంది. ప్రధానితో సమావేశం నుండి, అపెక్స్ కౌన్సిల్ భేటి వరకు ఆద్యంతం ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది