చిరు చెల్లిగా సాయి పల్లవి..?

యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నాడు మెగా స్టార్ చిరంజీవి. సైరా నర్సింహా రెడ్డి సినిమా తర్వాత కాస్త వేగం తగ్గించినా..  తాజాగా వరుసపెట్టి సినిమాలకు ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. ఈ సినిమా తర్వాత మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తమిళ ‘వేదాళం’ రీమేక్‌లో నటించనున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తో ఈ విషయం అందరికీ అధికారికంగా తెలిసిపోయింది.

తమిళ వేదాళం సినిమాలో అజిత్ హీరోగా నటించాడు.. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చెల్లి సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంటుంది. సినిమాకు కీలకమైన ఈ పాత్రను తెలుగులో సాయి పల్లవి పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సాయి పల్లవిని సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక తమిళ మాతృకలో అజిత్ సోదరిగా లక్ష్మీమీనన్ నటించింది. నిజానికి తొలుత తెలుగులోనూ లక్ష్మీనే తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సాయి పల్లవిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here