బ్యాచ్‌లర్స్ గ్రూప్ కి గుడ్ బై చెప్పిన సాయి ధరమ్ తేజ్..?

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యారు. ఈ లాక్‌డౌన్ లోనే హీరోలు నితిన్, నిఖిల్, రానా వంటి వారు పెళ్ళిలు చేసేసుకున్నారు. అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ తాను కూడా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సిగ్న‌ల్ ఇచ్చేశారు.

ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌దు మ‌రి అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సింగిల్ ఆర్మీ అనే ఓ బ్యాచ్‌లర్స్ వాట్సాఫ్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా ఒక్కొక్కరు లెఫ్ట్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాస్ అన్నా సారీ ఇప్పుడు నా వంతు వచ్చేసింది అంటూ ఆ గ్రూప్ నుంచి సాయిధ‌ర‌మ్ ‌తేజ్ కూడా లెఫ్ట్ అయిపోయారు. అయితే అసలు పెళ్ళి ఎప్పుడు, పెళ్ళి కూతురు ఎవరు అనే దానిపై రేపు ఉదయం 10 గంటలకు క్లారిటీ ఇస్తారట. ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలియాలంటే 10గంటల  వరకు వెయిట్ చేయాల్సిందే మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here