మెగాహీరో సాయిధరమ్ తేజ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని నిన్నంతా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తేజ్ ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని… అందుకే తన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డబ్బింగ్ కార్యక్రమానికి హాజరు కాలేదని వార్తలు వచ్చాయి.
Intense Prep work started for #SDT14 @devakatta garu nailing it with his writing…raring to go on set 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/930VgwawnP
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 6, 2020
అయితే ఈ వార్తలన్నింటికి ఒక్క పోస్టుతో చెక్ పెట్టాడీ మెగా హీరో. తేజ్ ప్రస్తుతం… ‘ప్రస్థానం’ సినిమా దర్శకుడు దేవకట్టతో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడానికి దేవ కట్టతో కలిసి ఆఫీస్ లో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన తేజ్.. ‘దేవాకట్టాగారితో చేస్తున్న నా 14వ సినిమా కోసం ప్రిపరేషన్ మొదలైంది’ అని క్యాప్షన్ జోడించాడు. ఇక లాక్ డౌన్కు ముందు లాంఛనంగా ప్రారంభమైన దేవాకట్టా-సాయి ధరమ్ చిత్రం ఈ నెల మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టనుంది. జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.