జనసేన పార్టీ పెట్టి గత ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా బీజేపీ కీ టీడీపీ కీ ఫుల్ సపోర్ట్ ఇచ్చి ప్రచారం కూడా చేసారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితి లో రంగం లోకి దిగుతా అంటున్న హీరో పవన్ కళ్యాణ్ నెమ్మదిగా రాయలసీమ ప్రాంతం లో కూడా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అనంతపూర్ నుంచి పోటీ చేస్తా అంటూ చెబుతున్న పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఆయనను ఇక్కడ అడుగు పెట్టనీయమని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు.
తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఎప్పడు పడితే అప్పుడు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కోస్తాంధ్రలో పోటీ చేసుకోవాలని అన్నారు. ప్రత్యేక రాయలసీమ మీద పవన్ కండిషన్ ఏంటో చెప్పాలి అని కోరారు ఆయన. ” నీకు సిగ్గుంటే ఇక్కడ అడుగు పెట్టకు . గోదావరి జిల్లలో నీ పబ్బం గడుపుకో ” అన్నారు ఆయన.