వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి తో ఆ పార్టీ మహిళా ఫైర్ బ్రాండ్ రోజా విసిగిపోయారు అనే వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఈ మధ్యనే జగన్ ఆమెని లోటస్ పాండ్ కి పిలిచి మరీ ఫుల్ గా వార్నింగ్ ఇవ్వడం తో ఆమె పార్టీ కి బై బై చెప్పేసే పనిలో ఉన్నారు అని వైకపా లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఈ మధ్య జగన్ చేసిన సర్వే లో రోజా పెర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు అనీ నియోజికవర్గం విషయం లో ఆమె ప్రవర్తన పట్ల జగన్ అసహనంతో ఉన్నారు అనీ టాక్ నడుస్తోంది. ఈమె పద్ధతి గురించి గత ఆరు నెలలుగా విసిగిపోయి ఉన్న జగన్ వార్నింగ్ ఇవ్వడం ఇది రెండో సారి.
సో జగన్ అలా అందరిలో అనడం వీలైనంత గా పార్టీ ని డిఫెండ్ చేస్తూ ఉన్న తనకి క్లాస్ పీకడం జీర్ణించుకో లేని రోజా పార్టీ మారిపోదాం అని చూస్తున్నారట. నెమ్మదిగా పవన్ కళ్యాణ్ జనసేన లోకి ఆమె అడుగు పెట్టిన ఆశ్చర్యపోవక్కరలేదు అంటున్నారు విశ్లేషకులు.